హైదరాబాద్ బస్టాండ్ లో ఒక ముసలావిడ వైజాగ్
వెళ్ళే బస్ ఎక్కింది. ఎక్కగానే డ్రైవర్ తో 'బాబు, నేను నిద్రపోతానేమో,
విజయవాడలో నన్ను లేపుతావా' అనడుగుతుంది. దానికా డ్రైవర్ సరే అంటాడు. ఆ
ముసలావిడ ఆ డ్రైవర్ మాటమీద నమ్మకం లేక తోటి ప్రయాణికులకు అందరికీ కూడా
చెప్తుంది. అందరూ సరే అంటారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ ముసలావిడ నిద్ర
నుంచి లేస్తుంది.
డ్రైవర్ : అయ్యయ్యో మర్చిపోయాను, విజయవాడ దాటేసి 100 km వచ్చేసాం బామ్మగారు.
దానికా ముసలావిడ ఏడుపందుకుంటుంది. తోటి ప్రయాణికులు ఆమె అవస్థ చూడలేక, బస్ వెనక్కు తిప్పమని అడుగుతారు.
డ్రైవర్ బస్ వెనక్కు తిప్పి విజయవాడ తీసుకు
వెళ్ళి దిగమని చెప్తాడు. అంతలో ఆ ముసలావిడ, తన బాగ్ లోనుండి రెండు మందు
బిళ్ళలు తీసి నోట్లో వేసుకుని, నీళ్ళు తాగి, డ్రైవర్ తో ఇలా అంటుంది.
'ఏమీ లేదు బిడ్డా, నాకు బి.పి. ఉంది. మా మనవడు,
విజయవాడ వెళ్ళగానే ఈ రెండు టాబ్లెట్స్ వేసుకోమన్నాడు. నేనూ కూడాఅ వైజాగే
వెళ్ళాలి, ఇప్పుడు వైజాగ్ పోనివ్వు ' 